ఘోర విషాదం.. తొక్కిసలాటలో 78 మంది మృతి

by Mahesh |
ఘోర విషాదం.. తొక్కిసలాటలో 78 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ సందర్భంగా ఓ ఛారిటీ సంస్థ ఎర్పాటు చేసిన విరాళాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 78 మంది మృతి చెందారు. ఈ ఘోరమైన సంఘటన యెమెన్ దేశం, సనాలోని పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు గురువారం తెలిపారు. అయితే రంజాన్ సందర్భంగా ఓ చారిటీ సంస్థ ప్రతి వ్యక్తికి సుమారు $9 విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రజలు పాఠశాలలో కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలోనే నిర్వహణ లోపం తో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఈ విరాళాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బాధ్యులైన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed