దాడి చేస్తే.. దాగి ఉన్న విషయం బయటపడింది

by  |
దాడి చేస్తే.. దాగి ఉన్న విషయం బయటపడింది
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారు చేస్తున్న ఓ ఇంటిపై ఎస్ వోటీ పోలీసుల దాడులు నిర్వహించి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లిలో ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ మద్యం తయారు చేస్తున్న పెనుమంచి విజయ్ కుమార్ (37) ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 15 లీటర్ల వైన్, మద్యానికి తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, టెస్టింగ్ క్యూబ్, ధర్మామీటర్, ఆల్కహాల్ టెస్టింగ్, వెయింగ్ మిషన్, సెల్ ఫోన్, కారును స్వాధీనం చేసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు నిందితుడు విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story