నిజామాబాద్‌లో దారుణ హత్య

by  |
నిజామాబాద్‌లో దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో సోమవారం ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని కర్రలతో కొట్టి చంపినట్లుగా గుర్తించారు. మృతుడి పేరు గంగారంగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


Next Story

Most Viewed