తమ్ముడిని చంపిన అన్న.. ఆలస్యంగా వెలుగులోకి

by  |
తమ్ముడిని చంపిన అన్న.. ఆలస్యంగా వెలుగులోకి
X

దిశ, వెబ్ డెస్క్: అన్ననే తమ్ముడిని హత్య చెసి గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసే యత్నం చేసిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. శవాన్ని ఆర్ధరాత్రి ఖననం చేసేందుకు ప్రయత్నం చేయగా వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించడంతో హత్యా కేసు వెలుగు చూసింది. ఈ సంఘటన సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీ చౌరస్తా వద్ద జరిగింది. గుర్బాబాది రోడ్ కు చెందిన మంత్రి రూపేష్, సతీష్ లు అన్నదమ్ములు. తమ్ముడు సతీష్ పనిపాట లేకుండా జులాయిగా తిరిగేవాడు. అన్న రూపేష్ హోటల్ నడుపుతూ కుటుంబాన్ని నడుపుతూ ఉండగా, తమ్ముడు సతీష్ నిత్యం మద్యం సేవించి వచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. సోమవారం రాత్రి తాగి వచ్చి గొడవ పడి తల్లిని కొట్టాడు. ఇంటి నుంచి బయకు వచ్చిన సతీష్ రోడ్డు పైన అన్న రూపేష్ తో గొడవ పడ్డాడు. ఈ సమయంలో ఇద్దరూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్నా రాయి తీసుకొని అన్న రూపేష్, తమ్ముడు సతీష్ తలపై మోదడంతో తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో ఈ విషయం చెప్పి రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేసే యత్నం చేశారు. వాచ్ మెన్ మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చెసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రూపేష్ ను అదుపులోకి తీసుకున్నట్టు నగర సీఐ సత్యనారాయణ తెలిపారు.


Next Story