మొన్నీమధ్యే పెళ్లయ్యింది.. అప్పుడే భార్యను కొట్టి చంపిండు

by  |
మొన్నీమధ్యే పెళ్లయ్యింది.. అప్పుడే భార్యను కొట్టి చంపిండు
X

దిశ, నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. గత రాత్రి చొప్పరి అశోక్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య శిరీష తలపై కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన శిరీషను వరంగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కొన్ని నెలల కిందట నెక్కొండకు చెందిన అశోక్ కు నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం కు చెందిన శిరీషకు పెళ్లైంది. కాగా, వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత రాత్రి మరోసారి జరిగిన గొడవలో నిందితుడు కర్రతో భార్యపై తలపై కొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed