క్రీడల మంత్రితో అజారుద్ధీన్ భేటీ

by  |
క్రీడల మంత్రితో అజారుద్ధీన్ భేటీ
X

హైదరాబాద్‌: క్రీడాకారులు మైదానంలో భౌతిక దూరం, కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ ఆదివారం మంత్రితో భేటీ అయ్యారు. క్రికెట్‌ క్రీడాకారులు మైదానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేప్పుడు ఆటగాళ్లు గుంపుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆటగాళ్లు చేతులు కల్పడం వంటి చర్యలు కూడా చేయవద్దన్నారు. ప్రతి ఆటగాడు మైదానంలో మాస్కులు ధరించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు.


Next Story