మృతదేహం మంచినీళ్లు తాగిందట..

by  |
మృతదేహం మంచినీళ్లు తాగిందట..
X

దిశ, వెబ్‌డెస్క్ :
మృతిచెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆ డెడ్‌బాడీ మంచినీళ్లు తాగిందని పుకారు లేవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. బతికున్న వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామా.. అనుకుని వెంటనే మృతి చెందిన వ్యక్తిని స్థానిక కేఐఎమ్ఎస్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కర్నాటకలోని ధార్వాడ్‌లో శుక్రవారం జరగగా స్థానికంగా కలకలం రేపింది.

బంధువుల వివరాల ప్రకారం.. అక్కడి డాక్టర్లు ఆ వ్యక్తిని మరల పరీక్షించగా మీరు అనుకుంటున్నది నిజం కాదని స్పష్టంచేశారు. అతను మృతిచెంది చాలా సమయం గడచిందని, మృతదేహం మంచినీళ్లు తాగడం మీ భ్రమ మాత్రమే అని కొట్టిపారేసారు. అనంతరం యథావిధిగా కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, గుండెపోటుతో సదరు వ్యక్తి మరణించినట్లు సమాచారం. పార్థివ దేహానికి స్నానాధికారాలు చేయించే క్రమంలో నోటిలో పోసిన మంచి నీటిని మృతదేహం మింగేసినట్లు అంత్యక్రియలకు వచ్చిన వారిలో ఒకరు భ్రమపడటమే ఇంతటి కల్లోలానికి దారి తీసింది.


Next Story

Most Viewed