కష్టాల్లో ఉన్నారు.. రూ. 7500 ఇవ్వాలి

by  |
కష్టాల్లో ఉన్నారు.. రూ. 7500 ఇవ్వాలి
X

దిశ, భువనగిరి: కరోనావైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామపం చాయతీ కార్యాలయం ముందు సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల సీనియర్ నాయకులు ఎదునూరి మల్లేష్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి నిరుపేదకుటుంబానికి నెలకు రూ. 7500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ ఐ జిల్లా నాయకులు అబ్దుల్లాపు రం వెంకటేష్, కడారి క్రిష్ణ, బొల్లె పల్లి పరమేష్, శ్రీరాం బాలరాజు, మైలారం శివప్రసాద్ తదితరు లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed