సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

by  |
సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు. ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్​ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. 6 నెలలుగా వీరికి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సాంకేతిక లోపం కారణంగా గత సంవత్సరంలో వీరికి 10నెలల వేతనమే విడుదలైందని రామకృష్ణ పేర్కొన్నారు.


Next Story

Most Viewed