ప్రైవేట్ హాస్పిటల్స్‌ను స్వాధీనం చేసుకోవాలి

by  |
ప్రైవేట్ హాస్పిటల్స్‌ను స్వాధీనం చేసుకోవాలి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను పూర్తిగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోని కరోనాను నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేవలం సగం బెడ్లు స్వాధీనం చేసుకుంటే ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం కేరళను చూసి నేర్చుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ కరోనా నియంత్రన కంటే సచివాలయంపై సమీక్షకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వెంటనే కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని కోరారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ తెలిపారు.


Next Story