వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజం రావాలి

by  |
వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజం రావాలి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: సమాజంలో వృద్ధాశ్రమాలు అవసరం లేని రోజులు రావాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కార్ఖానాలోని ఆర్కేఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వృద్ధుల ఆశ్రయం కోసం, వారి వైద్య సాయానికి మెడికల్ హోమ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజం రావాలని అభిలాషించారు. సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ డొనేట్ చేసిన ఆటోమేటెడ్ శానిటైజర్‌ను సీపీ ప్రారంభించారు.


Next Story

Most Viewed