కొవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు దరఖాస్తూ

by  |
కొవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు దరఖాస్తూ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాలు కరోనా దాటికి విలవిల లాడుతున్నాయి. ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడేందుకు అన్ని దేశాలూ వ్యాక్సిన్‌పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ రెండు, మూడు దశల హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) డీసీజీఐ అనుమతి కోరింది. పుణెకు చెందిన ఎస్‌ఐఐ కొవిడ్‌ షీల్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు అనుమతి కోరుతూ డీసీజీఐకి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వాఖ వర్గాలు తెలిపాయి

ట్రయల్స్‌ కోసం 18 ఏళ్లు పైబడిన 1600 మంది ఎన్‌రోల్‌ చేసుకున్నట్టు తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు ఎస్‌ఐఐ బ్రిటన్‌కు చెందిన ఫార్మా కంపెనీ అస్త్ర జెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ సహా ప్రపంచంలోని మధ్య, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ను వచ్చే నెలలో జరపాలని భావిస్తున్న ఎస్‌ఐఐ వర్గాలు వెల్లడించాయి.


Next Story

Most Viewed