- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి

X
దిశ, వెబ్ డెస్క్: కొందరు కామపిశాచులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అవమానీయ ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కష్ట కాలంలో వారి వ్యవహారం గమనిస్తే.. మరీ ఇంత దారుణమా అని ఆగ్రహం వ్యక్తం చేయక మానదు. కరోనా సోకి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కోవిడ్ సెంటర్ లో 14 ఏళ్ల మైనర్ బాలిక కరోనా సోకి చికిత్స పొందుతున్నది. అయితే అక్కడే కరోనా చికిత్స పొందుతున్న మరో వ్యక్తి ఆమెపై దారుణం ఒడిగట్టాడు. బాత్రూమ్ వద్ద ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని మరో కరోనా పేషెంట్ తన ఫోన్లో చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలిని మరో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Next Story