ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఎన్నంటే ?

by  |
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఎన్నంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ దాని కరాళ నృత్యాన్ని ఆపడంలేదు. తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ప్రతిరోజూ దాని బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 53,601 కొత్త కేసులు నమోదయ్యాయి. 871 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షల 68,675కు చేరింది. ఇందులో 15,83,489 మంది బాధితులు కోరనా నుంచి కోలుకున్నారు. 6,39,929 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 45,257 మంది కరోనాతో మృతిచెందారు.


Next Story