- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. కరోనా సోకి చాలామంది ప్రజలు ప్రాణాలుకోల్పోతున్నారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. మరికొన్ని కుటుంబాల పరిస్థితి అయితే వర్ణనాతీతం. తాజాగా కామారెడ్డిలో జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరిలో కన్నీళ్లు పెట్టకతప్పడంలేదు.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలో దంపతులు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో రాజేశ్-స్రవంతి అనే వీరిద్దరూ దంపతులు. అయితే, వీరిద్దరూ కరోనా మృతిచెందారు. కరోనా సోకి ఈనెల 7న భర్త రాజేష్ మృతిచెందాడు. నేడు ఉదయం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య స్రవంతి కూడా కన్నుమూసింది. దీంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరో బాధాకర విషయమేమిటంటే… మృతుడు రాజేష్ కూతురు, తండ్రికి కరోనా సోకింది. దీంతో వారు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా రాజేష్ అంత్యక్రియల్లో పాల్గొన్న 9 మందికి కూడా కరోనా సోకింది. వీరంతా కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.