- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ జీఎస్టీ కమిషనర్రేట్లో అవినీతి తిమింగలాల భాగోతం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఏకంగా రూ. 5 కోట్ల లంచం డిమాండ్ చేయడం ప్రభుత్వ వర్గాల్లోనే హాట్ టాపిక్గా మారింది. ఓ ప్రైవేట్ కంపెనీలో అధికారులు దాడులు చేయగా.. ఈ వ్యవహారం బయటపడింది.
ఓ ప్రైవేట్ కంపెనీ ఇన్పుట్ క్రెడిట్ మంజూరు చేసేందుకు.. జీఎస్టీ కమిషనర్రేట్లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో చేసే ఇద్దరు అధికారులు రూ. 5 కోట్ల భారీ లంచం డిమాండ్ చేశారు. సుధారాణి, బొల్లినేని శ్రీనివాస్ గాంధీలు సదరు కంపెనీ డైరెక్టర్ల నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్టు గుర్తించారు. దీంతో నిందితుల పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో వరుసగా అవినీతి అధికారుల వ్యవహారాలు వెలుగుచూడటం గమనార్హం.
Next Story