జీఎస్టీ ఆఫీసులో అవినీతి తిమింగలాలు

by  |
జీఎస్టీ ఆఫీసులో అవినీతి తిమింగలాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జీఎస్టీ కమిషనర్‌రేట్‌లో అవినీతి తిమింగలాల భాగోతం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఏకంగా రూ. 5 కోట్ల లంచం డిమాండ్ చేయడం ప్రభుత్వ వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. ఓ ప్రైవేట్ కంపెనీలో అధికారులు దాడులు చేయగా.. ఈ వ్యవహారం బయటపడింది.

ఓ ప్రైవేట్ కంపెనీ ఇన్‌పుట్ క్రెడిట్ మంజూరు చేసేందుకు.. జీఎస్టీ కమిషనర్‌రేట్‌లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో చేసే ఇద్దరు అధికారులు రూ. 5 కోట్ల భారీ లంచం డిమాండ్ చేశారు. సుధారాణి, బొల్లినేని శ్రీనివాస్ గాంధీలు సదరు కంపెనీ డైరెక్టర్ల నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్టు గుర్తించారు. దీంతో నిందితుల పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో వరుసగా అవినీతి అధికారుల వ్యవహారాలు వెలుగుచూడటం గమనార్హం.


Next Story