6 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
6 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,148 కొత్త కేసులు నమోదు కాగా, 434 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 4,641 కు చేరుకుంది. ఇందులో 3,59,859 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. 2,26,947 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిదంగా దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతి చెందినవారి సంఖ్య 17,834 కు పెరిగింది.


Next Story

Most Viewed