భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. 848 మంది మృతి

by  |
భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. 848 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి వందల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు.

మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లో 60,975 కొత్త కేసులు నమోదయ్యాయి. 848 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 31,67,324 కు చేరింది. ఇందులో 24,04,585 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 7,04,348 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో 58,390 మంది బాధితులు మృతిచెందారు.



Next Story