ఫ్యామిలీ వివక్ష.. కరోనా బాధితుడు ఆత్మహత్య

by  |
ఫ్యామిలీ వివక్ష.. కరోనా బాధితుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: కుటుంబ సభ్యులు వివక్ష చూపుతున్నారని ఓ కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పి.గన్నవరం మండలం మొండెపులంకకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది.

అయితే, అతను సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. కరోనా సోకడంతో తనను కుటుంబ సభ్యులే తనపై వివక్ష చూపిస్తారని తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తెలిసింది.


Next Story

Most Viewed