శుభవార్త.. ఇక కరోనా టెన్షన్ లేనట్టే!

by  |
శుభవార్త.. ఇక కరోనా టెన్షన్ లేనట్టే!
X

దిశ, వెబ్ డెస్క్: అవును మీరు విన్నది నిజమే. విషయమేమిటంటే అతి త్వరలో కరోనాకు వ్యాక్సిన్ రానున్నదా అని ఎదురుచూసే ఎదురుచూపులకు ఐసీఎంఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తోన్న మహమ్మారిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ ను భారత్ అభివృద్ధి చేసిందంట. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ చెబుతోంది. ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ఐసీఎంఆర్ ప్రకటించింది. వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. జంతువులపై ప్రయోగంలో సత్ఫాలితాలు వచ్చాయని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో ఖచ్చితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఇక ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారెవరికీ కరోనా సోకే ప్రమాదం ఉండబోదని స్పష్టం చేసింది.



Next Story

Most Viewed