మృతుడికి కరోనా.. డబ్బులు తీసుకుని కాల్చేసిన అంబులెన్స్ డ్రైవర్‌

by  |
మృతుడికి కరోనా.. డబ్బులు తీసుకుని కాల్చేసిన అంబులెన్స్ డ్రైవర్‌
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోజురోజుకు మనుషుల్లో మానవీయ కోణం చచ్చిపోతుంది. తమ క్షేమం కోసం కుటుంబ సభ్యుల విషయంలో ఏ మాత్రం ప్రేమాభిమానులు చూపడంలేదు. ఇలాంటి కోవకు చెందిన ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే ఆ యువకుడికి కరోనా సోకింది.

దీంతో ఆ యువకుడి మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు అంబులెన్స్ డ్రైవర్ కు అప్పగించారు. ఇందుకోసం ఆ డ్రైవర్ కు రూ. 17 వేలు ఇచ్చారు. దీంతో ఆ యువకుడి మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్ జిల్లా సరిహద్దులో తగులబెట్టాడు. అర్థరాత్రి మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.


Next Story

Most Viewed