మరో 122 మంది పోలీసులకు కరోనా

by  |
మరో 122 మంది పోలీసులకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు. దాని బారిన పడకుండా ప్రజలను రక్షిస్తున్న వారియర్స్ ను కూడా అది వదలడంలేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన 122 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో పోలీస్ శాఖలో మరోసారి కరోనా కలకలం రేగింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,189కు చేరింది. ఇందులో 11,423 మంది పోలీసులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 2,622 మంది పోలీసులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా సోకి ఇద్దరు పోలీసులు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 144కు చేరింది.



Next Story

Most Viewed