కరోనా పాట పాడి.. అదే జబ్బుకు బలి..!

by  |
కరోనా పాట పాడి.. అదే జబ్బుకు బలి..!
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రపంచాన్నే కకావికలం చేస్తున్న కరోనా వైరస్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్లపై ఎస్పీ బాలు పాడిన ‘భరత్ భూమి’ వీడియో పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చినా చివరకు అదే వైరస్‌కు బలయ్యారు. దేశవ్యాప్తంగా వైద్యులు, పోలీసులు, పారిశుద్య కార్మికులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడుతూ సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక వీడియో పాటకు ప్లాన్ చేశారు. కరోనా పేషెంట్లకు నిస్వార్థంగా సేవచేస్తున్న వీరి అంకితభావాన్ని ప్రశంసించి ప్రజల్లో స్ఫూర్తి కలిగించడం ఈ వీడియో పాట ఉద్దేశం. తమిళం, హిందీ భాషల్లో రూపొందించిన ఆ పాటకు గాత్రాన్ని సమకూర్చి ‘యూట్యూబ్’ ద్వారా మే నెల 30న ఇళయరాజా చేతుల మీదుగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. చివరకు మూడు నెలల తర్వాత అదే కరోనా వైరస్‌కు ప్రాణాలు కోల్పోయారు. ఏ వైద్య సిబ్బంది కృషిని కొనియాడారో వారి చేతుల్లోనే తుది శ్వాస వదిలారు.

Read Also…

బాలు మృతిపట్ల కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి


Next Story