ఏపీలో 10,418 కరోనా కేసులు

by  |
ఏపీలో 10,418 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాదాపు 12రోజుల నుంచి 10వేలకు తగ్గకుండా కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 71,692మందికి పరీక్షలు నిర్వహించగా 10,418మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 27వేల 512కు చేరింది. 74మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,634గా ఉంది. ప్రస్తుతం 97,271 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 4లక్షల 25వేల 607మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 9,842 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 43,08,762మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారినపడి కడప జిల్లాలో 9మంది ప్రాణాలు కోల్పోగా నెల్లూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విజయనగరంలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 801 మందికి పాజిటివ్‌ రాగా చిత్తూరులో 887, తూర్పుగోదావరిలో 1,399, గుంటూరులో 707, కడపలో 785, కృష్ణాలో 350, కర్నూలులో 484, నెల్లూరులో 949, ప్రకాశంలో 1,271 శ్రీకాకుళంలో 660, విశాఖపట్నంలో 414, విజయనగరంలో 577, పశ్చిమగోదావరిలో 1,134 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బెలెటిన్ వెల్లడించింది.


Next Story