రావుపాలెం ఎస్సైకి కరోనా

by  |
రావుపాలెం ఎస్సైకి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఘోరంగా విజృంభిస్తోంది. దానిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చాపకింద నీరులా అది వ్యాపిస్తూనే ఉంది. కంటికి కనిపించని ఈ మహమ్మారితో యుద్ధం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను కూడా అది వదలడంలేదు.

తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని రావుపాలెం ఎస్సైకి కరోనా సోకింది. అదేవిధంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ముగ్గురు పోలీసులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఆ పోలీస్ స్టేషన్లను పూర్తిగా శానిటైజ్ చేసి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటికే ఏపీలో పలువురు పోలీసులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed