మేనేజర్‌కు కరోనా.. బ్యాంకు మూసివేత

by  |
మేనేజర్‌కు కరోనా.. బ్యాంకు మూసివేత
X

దిశ, చేర్యాల: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రజలు దాని కోరలకు చిక్కి అల్లాడిపోతున్నారు. ఎవరినీ కూడా కరోనా వైరస్ వదలడంలేదు. తాజాగా సిద్ధిపేట జిల్లా చేర్యాలలోని అంగడి బజార్ లో ఉన్న ఎస్‌బీఐ శాఖలో పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ బ్యాంకును అధికారులు మూసివేశారు. బ్యాంకులో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులను హోం క్వారంటైన్ లో ఉండాలని పోలీసులు ఆదేశించారు.


Next Story

Most Viewed