సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్

by  |
సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీఎం రమేశ్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కొవిడ్‌ పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీఎం రమేష్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్టు ఆయన తెలిపారు.



Next Story

Most Viewed