దేశంలో కరోనా రికార్డు.. ఒకేరోజు 19,906 కేసులు

by  |
దేశంలో కరోనా రికార్డు.. ఒకేరోజు 19,906 కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విస్తృతవ్యాప్తి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజు అందరూ నివ్వెరపోయేలా కేసులు నమోదు అవుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,906 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజులోనే ఇంత ఎక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,859కి చేరింది. అందులో 2,03,051 యాక్టివ్ కేసులు కాగా, 03,09,713 మంది కరోనా నుంచి ఇప్పటివరకూ కోలుకున్నారు. కొత్తగా దేశంలో 410 మంది కరోనా వైరస్ మూలంగా మృతిచెందారు. దీంతో మొత్తంగా మరణించిన వారి సంఖ్య16,095కు చేరింది.


Next Story

Most Viewed