- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఏపీలో గత 5రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 66,121మందికి పరీక్షలు నిర్వహించగా 5,487మందికి పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల 81వేల 161కి చేరింది. తాజాగా 37మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,210గా ఉంది. ప్రస్తుతం 63,116 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6లక్షల 12వేల 300మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 7,210మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56లక్షల 66వేల 323మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా మహమ్మారి బారిన పడి ప్రకాశం జిల్లాలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చనిపోయారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,010 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అనంతపురంలో 310, చిత్తూరులో 329, గుంటూరులో 538, కడపలో 271, కృష్ణా జిల్లాలో 97, కర్నూలులో 113, నెల్లూరులో 489, ప్రకాశంలో 634, శ్రీకాకుళంలో 286, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 362, పశ్చిమగోదావరి జిల్లాలో 903 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది.