ఏపీలో 7,228 కరోనా కేసులు

by  |
ఏపీలో 7,228 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 72,838 మందికి పరీక్షలు నిర్వహించగా 7,228మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 46,530కి చేరింది. 45మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 5,506గా ఉంది. ప్రస్తుతం 70,357యాక్టివ్ కేసులు ఉండగా చికిత్స తీసుకొని 5లక్షల 70వేల 667 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 8,291మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 53లక్షల 2వేల 367మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ప్రకాశంలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 612 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా చిత్తూరులో 536, తూర్పుగోదావరిలో 1,112, గుంటూరులో 648, కడపలో 600, కృష్ణా జిల్లాలో 428, కర్నూలులో 229, నెల్లూరులో 479, ప్రకాశంలో 502, శ్రీకాకుళంలో 319, విశాఖపట్నంలో 414, విజయనగరంలో 387, పశ్చిమగోదావరిలో 962కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story