ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసులో కరోనా కలకలం

by  |
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసులో కరోనా కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసులో కరోనా కలకలం సృష్టించింది. క్యాంపు ఆఫీసు బయట విధులు నిర్వహిస్తున్న 10మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా నిర్దారణ అయినట్టు తేలింది. దీంతో ఒక్కసారిగా అధికారిక యంత్రాంగం షాక్ కు గురయ్యింది.ఇటీవల క్యాంపు కార్యాలయం వద్ద ఏపీ ఆరోగ్య శాఖ కరోనా టెస్టులు జరిపింది. అయితే, శనివారం వెల్లడైన రిపోర్టుల్లో ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన 8మంది పోలీసులకు, మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు ధృవీకరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని హోం క్వారంటైన్ కు తరలించారు. అలాగే వారి ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.


Next Story

Most Viewed