ఏపీలో 5లక్షలు దాటిన కేసులు

by  |
ఏపీలో 5లక్షలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 58,157మందికి పరీక్షలు నిర్వహించగా 8,368మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 6వేల 493కి చేరింది. 70మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 4,487గా ఉంది. ప్రస్తుతం 97,932 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 4లక్షల 4వేల 74మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 41,66,077మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి ప్రకాశం జిల్లాలో 10మంది ప్రాణాలు కోల్పోగా, గుంటూరు జిల్లాలో 9మంది, చిత్తూరులో 8మంది, కడపలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురంలో నలుగురు, కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, విశాఖలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు మరణించారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,312 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా పశ్చిమగోదావరిలో 950, నెల్లూరులో 949, చిత్తూరులో 875, గుంటూరులో 765, విజయనగరం జిల్లాలో 594, అనంతపురంలో 584, శ్రీకాకుళంలో 559, కడపలో 447, ప్రకాశంలో 419, విశాఖలో 405, కర్నూలు జిల్లాలో 316, కృష్ణా జిల్లాలో 193 కేసులు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed