భ‌ద్రాద్రి జిల్లాలో మ‌రో క‌రోనా కేసు

by  |
భ‌ద్రాద్రి జిల్లాలో మ‌రో క‌రోనా కేసు
X

దిశ‌, కొత్త‌గూడెం: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతుంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించార‌ని క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి తెలిపారు. దీంతో గౌతంపూర్‌లో స‌ద‌రు వ్య‌క్తి ఉండే ప్రాంతాన్ని కంటోన్మెంట్‌గా ప్ర‌క‌టించి రాక‌పోక‌లు నిలిపివేసిన‌ట్టు తెలిపారు. ఆ ప్రాంతంలోని వారంతా స్వీయ నిర్బంధం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి వారినీ పరీక్షించనున్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్టు తెలిపారు.


Next Story

Most Viewed