మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కరోనా నెగిటివ్

by  |
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కరోనా నెగిటివ్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యే ప్రతి సభ్యుడూ కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించుకోగా, ఫలితాల్లో ఆయనకు నెగటివ్ రిపోర్టు వచ్చింది.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… కరోనా విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్త పడాలని కోరారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలను ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు.



Next Story

Most Viewed