కోవిడ్ పరిశీలనకు తనిఖీ బృందాలు

by  |
కోవిడ్ పరిశీలనకు తనిఖీ బృందాలు
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్:
క్షేత్ర స్థాయిలో కోవిడ్-19ను పరిశీలించేందుకు ఏర్పాటైన తనిఖీ బృందాలు ఏకకాలంలో వాటి తనిఖీలను బుధవారం ప్రారంభించాయి. కోవిడ్ బాధితుల గుర్తింపు పరీక్ష విధానం, చికిత్సలు, అనుమానితుల ట్రేసింగ్ వంటి అంశాలపై ఆయా పీహెచ్‌సీల వైద్యులు,సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొత్త కేసులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని వారు సూచించారు. సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ అంశంపై సిబ్బందితో రాష్ట్ర అబ్జర్వర్ సయీదొద్దిన్ సుమారు మూడు గంటలపాటు సమీక్షించారు. ఇంకా అవసరమైన సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ఆరోగ్య కమిషనర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఏక కాలంలో నిర్మల్,ఆదిలాబాద్,మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో ఈ తనిఖీలను నిర్వహించారు.


Next Story