ఆదిలాబాద్ రిమ్స్ స్టాఫ్ నర్సుకు కరోనా

by  |
ఆదిలాబాద్ రిమ్స్ స్టాఫ్ నర్సుకు కరోనా
X

దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ పనిచేసే ఓ స్టాఫ్ నర్స్‌కు కరోనా సోకింది. మూడు రోజుల క్రితం కరోనాతో మృతిచెందిన ఓ వృద్ధురాలికి చికిత్స చేయడంతో స్టాఫ్ నర్స్‌ కూడా కరోనా బారిన పడినట్లు రిమ్స్ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిణామంతో శనివారం రిమ్స్‌లో పనిచేస్తున్న ఐదుగురు వైద్యులు, 16 మంది నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బందిని హోమ్ క్వారంటైన్ చేశారు.


Next Story

Most Viewed