చక్కెర ఫ్యాక్టరీలో ముగ్గురు వ్యక్తులకు కరోనా

by  |
coronavirus
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల సమీపంలో ఉన్న కృష్ణవేణి చక్కెర కర్మాగారంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారిలో ఇద్దరు కొత్తకోటలో నివాసం ఉంటుండగా మరొకరు కర్మాగారంలోనే ఉంటున్నారు. కర్మాగారంలో కార్మికులకు కరోనా సోకడంతో మిగతా కార్మికులంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే కొత్తకోటలో కార్మికులు నివాసం ఉండే ప్రాంతాలలో అధికారులు కాంటాక్ట్ కేసులను గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే కర్మాగారంలో కూడా కార్మికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.


Next Story