మరో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా..!

by  |
మరో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ సామాన్యులతో పాటు ప్రముఖ నేతలను వదలడం లేదు. తాజాగా పంజాబ్‎లో మరో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా బారిన పడ్డారు. ఎమ్మెల్యేలు రణదీప్ నాభా, అంగద్ సింగ్, అమన్ అరోరా, పర్మిందర్ ఢిండ్సాకు కరోనా సోకినట్లు సీఎం అమరీందర్ సింగ్ గురువారం ప్రకటించారు. దీంతో పంజాబ్‎లో కరోనా పాజిటివ్ ఎమ్మెల్యేల సంఖ్య 33కు చేరింది. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించాలని సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.



Next Story