శ్రీహరికోటపై కరోనా ఎఫెక్ట్

by  |
శ్రీహరికోటపై కరోనా ఎఫెక్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా ప్రభావం ఇస్రోపై పడింది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ (ఎస్‌డీఎస్‌సీ-షార్)లో ప్రతిరోజూ జరిగే అన్ని రకాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ మేరకు షార్ కంట్రోలర్ కుంభకర్ణన్ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. షార్‌, సూళ్ళూరు పేటలో పాజిటివ్ కేసుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నందువల్ల వైరస్ సోకినవారిని గుర్తించి ప్రత్యేకంగా చికిత్స అందించాలని పేర్కొన్నారు. కార్యాలయ ప్రాంగణాల్లో ఫ్యుమిగేషన్, శానిటైజేషన్ చేయించడం కోసం షార్ కార్యకలాపాలన్నిటినీ తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించారు. రాకెట్ లాంచ్ స్టేషన్‌లో ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు అతి తక్కువ మంది సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారని తెలిపారు.


Next Story

Most Viewed