తెలంగాణలో పెరిగిన కరోనా మరణాలు

by  |
తెలంగాణలో పెరిగిన కరోనా మరణాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని ప్రభావంతో రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతోంది. గత కొద్ది రోజుల నుంచి 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,257 కొత్త కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతిచెందారు.

తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. ఇందులో 54,330 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 22,568 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ 464, రంగారెడ్డి 181, మేడ్చల్ లో 138 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 615 మంది కరోనాతో మృతిచెందారు.


Next Story