తిరుపతి రుయాలో కరోనా మృ‌తదేహం మిస్సింగ్

by  |
తిరుపతి రుయాలో కరోనా మృ‌తదేహం మిస్సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి రుయా ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. కరోనా మృతదేహం మిస్పింగ్ అయింది. వెదరుకుప్ప మండలం మొండి వెంగన్నపల్లికి చెందిన అబ్బులయ్య కరోనా సోకడంతో రుయాలో చేరాడు. మంగళవారం ఉదయం చనిపోయాడని అతని బంధువులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. అబ్బులయ్య కేసు షీట్‌లో మరో రోగి మరణం వివరాలు నమోదు అయ్యాయి. కాగా, అబ్బులయ్య ఫోన్ ఆదివారం నుంచి పనిచేయడం లేదు. ఆఖరికీ రూయా మార్చురీలోనూ అబ్బులయ్య మృతదేహం కోసం వెతికినా దొరకలేదు. దీంతో అతని బంధవులు ఆసుపత్రి సిబ్బందిపై ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed