తెలంగాణలో 80,751 కి చేరిన కరోనా కేసులు

by  |
తెలంగాణలో 80,751 కి చేరిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,256 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 80,751కు చేరింది. ఇందులో 57,586 మంది బాధితులు కోరనా నుంచి కోలుకున్నారు. 22, 528 మంది కరోనాతో పోరాడుతున్నారు.

అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 637 మంది కరోనాతో మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ -389, రంగారెడ్డి-86, కరీంనగర్ -73 కేసులు నమోదయ్యాయి.



Next Story