ఏపీలో 6లక్షల 75వేలు దాటిన కేసులు

by  |
ఏపీలో 6లక్షల 75వేలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 76,416 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,923 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6లక్షల 75వేల 674కి చేరింది. 45మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,708గా ఉంది. తాజాగా 7,796మంది కోలుకున్నారు. ప్రస్తుతం 64,876 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6లక్షల 5వేల 90మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 56,00,272మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా ప్రకాశం జిల్లాలో 8మంది ప్రాణాలు కోల్పోగా కృష్ణా జిల్లాలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కడపలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 480 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 577 తూర్పుగోదావరిలో 1,006, గుంటూరులో 535, కడపలో 472, కృష్ణాలో 333, కర్నూలులో 229, నెల్లూరులో 506, ప్రకాశంలో 659, శ్రీకాకుళంలో 503, విశాఖపట్నంలో 318, విజయనగరంలో 318, పశ్చిమగోదావరిలో 929 కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed