తెలంగాణలో కరోనా విజృంభణ..!

by  |
తెలంగాణలో కరోనా విజృంభణ..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే కొత్తగా 2,296 కేసులు నమోదు కాగా.. 10 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 1,77,070 కేసులు నమోదవ్వగా, ఇప్పటివరకు 1,062 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 29,873 ఉండగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,46,135 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇక ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 321 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు జీహచ్ఎంసీ పరిధిలో మొత్తం 58,197 కేసులు నమోదు అయ్యాయి. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 26,28,891 కరోనా పరీక్షలు నిర్వహించారు.


Next Story

Most Viewed