పల్లెలకు పాకుతున్న కరోనా..

by  |
పల్లెలకు పాకుతున్న కరోనా..
X

దిశ, కాటారం :
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గండికామారం హామ్లేట్ విలేజ్ గోల్లెపల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గోపీనాధ్ వెల్లడించారు. బాధితుడు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తుండగా అక్కడి డాక్టర్లలకు పాజిటివ్ అని తేలింది. దీంతో తనకు కూడా కరోనా ఉందేమో అనే అనుమానంతో టెస్ట్ చేయించుకున్న ఆ వ్యక్తికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో అతన్ని హోం ఐసోలేషన్ చేసినట్లు డాక్టర్ తెలిపారు. ఈ మేరకు గ్రామంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి ఒకరు కరోనా పాజిటివ్‌తో చనిపోగా గ్రామ పొలిమేరల్లోనే కొవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలు చేయించినట్లు సర్పచ్ శ్రీపతి బాపు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉండాలని కోరినట్లు చెప్పారు.



Next Story

Most Viewed