వామ్మో.. అన్ని కేసులా..?

by  |
వామ్మో.. అన్ని కేసులా..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కేసులు నమోదవగా 379 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 25 వేల 544 కు చేరుకుంది. ఇందులో 3 లక్షల 79 వేల 892 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 లక్షల 77 వేల 439 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి 18,213 మంది మృతి చెందారు.


Next Story