భారత్‌లో రికార్డ్‌ స్థాయిలో కేసులు

by  |
భారత్‌లో రికార్డ్‌ స్థాయిలో కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 24,248 కొత్త కేసులు నమోదవగా.. 425 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 97,413 కు పెరిగింది. ఇందులో 4 లక్షల 24,433 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 లక్షల 53,287 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 19,693కు చేరింది.


Next Story