కరోనా బులెటిన్ విడుదల.. కేసులెన్నంటే ?

by Anukaran |
కరోనా బులెటిన్ విడుదల.. కేసులెన్నంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలకు ప్రతి రోజు ప్రజలు వేల సంఖ్యలో చిక్కుకుంటున్నారు. వందల మంది ప్రాణాలను అది బలిగొంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 63,490 కొత్త కేసులు నమోదయ్యాయి. 944 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 25 లక్షల 89,682 కు చేరింది. ఇందులో 18 లక్షల 62,258 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6 లక్షల 77,444 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనాతో ఇండియాలో 49,980 మంది బాధితులు మృతిచెందారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed