దేశవ్యాప్తంగా 17,400 మంది మృతి

by  |
దేశవ్యాప్తంగా 17,400 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,563 కొత్త కేసులు నమోదు కాగా, 507 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 85 వేల 493 కు పెరిగింది. ఇందులో 3 లక్షల 47 వేల 979 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. 2 లక్షల 20 వేల 114 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా సోకి ఇప్పటివరకు 17,400 మంది మృతిచెందారు.


Next Story

Most Viewed