- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మతం పేరిట రాజకీయాలు చేస్తూ దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ ఎస్ వేణుగోపాలచారి ధ్వజమెత్తారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమవేశంలో వేణుగోపాలచారి మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలతో ప్రధాని మోదీ, అమిత్ షా కుమ్మక్కయ్యారని విమర్శించారు. జీఎస్టీ పేరిట రాష్ట్రాలను మోదీ సర్కారు మోసం చేస్తుందని ఆరోపించారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా రైతులను తీవ్రంగా మోసగించే దిశగా వ్యవసాయ బిల్లును తీసుకొచ్చారని.. దీనిపై రైతులు ఆందోళనలకు సిద్ధం కావాలని వేణుగోపాలచారి పిలుపునిచ్చారు. కరోనా విషయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ సర్కారు ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని.. దక్షిణాది రాష్ట్రాలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు.